ఎన్నిసార్లు విచారణకు పిలిచినా హాజరవుతా: ఎమ్మెల్సీ కవిత
- తాను ఎలాంటి తప్పు చేయలేదన్న కవిత
- ప్రధాని మోదీని ఎవరు ప్రశ్నించినా ఇలానే దాడులు జరుగుతాయని విమర్శ
- మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో కేంద్రం విఫలమైందని వ్యాఖ్య
ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహిళా రిజర్వేషన్ బిల్లుపై కవిత నిరాహార దీక్ష చేపట్టారు. దానికి కొనసాగింపుగా ఈ రోజు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని కవిత చెప్పారు. ఈడీ తనను ఎన్నిసార్లు పిలిచినా విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు. ప్రధాని మోదీని ఎవరు ప్రశ్నించినా ఇదే తరహా దాడులు జరుగుతాయన్నారు.