శంషాబాద్ లో 15 కిలోల బంగారం పట్టివేత.. నలుగురు సూడానీ మహిళల అరెస్ట్
- షూలలో రహస్యంగా దాచి తీసుకొచ్చిన వైనం
- పట్టుబడ్డ బంగారం విలువ రూ.8 కోట్ల పైనేనన్న అధికారులు
- మొత్తం 23 మంది సూడానీ మహిళలు వచ్చారని వివరణ
గురువారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో సూడాన్ నుంచి వచ్చిన విమానంలో 23 మంది మహిళల బృందం దిగింది. వారిలో నలుగురు మహిళలు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని ప్రత్యేకంగా సోదాలు చేసినట్లు అధికారులు తెలిపారు. వారి షూలను పరిశీలించగా.. మడమల స్థానంలో ప్రత్యేక అరలు బయటపడ్డాయని చెప్పారు.
అందులో బంగారాన్ని దాచి తీసుకొచ్చారని వివరించారు. నలుగురి దగ్గరా కలిపి మొత్తం 15 కిలోల బంగారం బయటపడిందని పేర్కొన్నారు. మిగతా వారిని కూడా పరిశీలించినా ఏమీ దొరకలేదన్నారు. దీంతో ఆ నలుగురు మహిళలను అరెస్టు చేసి, మిగతా వారికి నోటీసులు ఇచ్చి పంపించినట్లు అధికారులు తెలిపారు.