Advertisement

కాసేపట్లో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్న కన్నా... బీజేపీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు

Kanna Lakshminarayan joining TDP today
  • 3 వేల మందితో టీడీపీలో చేరనున్న కన్నా
  • భారీ ర్యాలీతో టీడీపీ కార్యాలయానికి వెళ్లనున్న సీనియర్ నేత
  • కొందరు బీజేపీ నేతలు తనతో టచ్ లో ఉన్నారని సంచలన వ్యాఖ్య
ఏపీ సీనియర్ రాజకీయవేత్తల్లో ఒకరైన కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన పసుపు కండువా కప్పుకోనున్నారు. ఈ మధ్యాహ్నం 2.48 గంటలకు 3 వేల మందితో టీడీపీలో చేరుతున్నట్టు ఆయన ప్రకటించారు. 

టీడీపీలో చేరబోతున్న తరుణంలో కన్నా సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంత మంది బీజేపీ నేతలు తనతో టచ్ లో ఉన్నారని చెప్పారు. వారు కూడా టీడీపీలో చేరే అవకాశం ఉందనే కోణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు గుంటూరు లోని తన నివాసం నుంచి కన్నా లక్ష్మీనారాయణ భారీ ర్యాలీతో బయల్దేరి టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకోనున్నారు. అనంతరం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు.
Advertisement
Kanna Lakshminarayana
Chandrababu
Telugudesam
BJP

More Telugu News