కాసేపట్లో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్న కన్నా... బీజేపీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు
- 3 వేల మందితో టీడీపీలో చేరనున్న కన్నా
- భారీ ర్యాలీతో టీడీపీ కార్యాలయానికి వెళ్లనున్న సీనియర్ నేత
- కొందరు బీజేపీ నేతలు తనతో టచ్ లో ఉన్నారని సంచలన వ్యాఖ్య
టీడీపీలో చేరబోతున్న తరుణంలో కన్నా సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంత మంది బీజేపీ నేతలు తనతో టచ్ లో ఉన్నారని చెప్పారు. వారు కూడా టీడీపీలో చేరే అవకాశం ఉందనే కోణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు గుంటూరు లోని తన నివాసం నుంచి కన్నా లక్ష్మీనారాయణ భారీ ర్యాలీతో బయల్దేరి టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకోనున్నారు. అనంతరం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు.