మైదానంలోనే ప్రత్యర్థులు.. మ్యాచ్ ముగియగానే స్నేహితులైపోయిన భారత్, పాక్ క్రికెటర్లు

 India Pakistan Players All Smiles After T20 World Cup Clash
  • మహిళల టీ20 ప్రపంచ కప్ లో నిన్న రాత్రి భారత్, పాకిస్థాన్ మ్యాచ్ 
  • 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్
  • ఆట పూర్తవగానే ఒక్కచోటకు చేరి సరదాగా గడిపిన క్రికెటర్లు
మహిళల టీ20 ప్రపంచ కప్ లో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ఆదివారం రాత్రి హోరాహోరీ మ్యాచ్ అభిమానులను అలరించింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో భారత్ ఏడు వికెట్ల తేడాతో పాకిస్థాన్ ను ఓడించి టోర్నమెంట్ లో శుభారంభం చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన పాక్ జట్లు నిర్ణీత 20 ఓవర్లలో 149/4 స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో భారత్ వరుస విరామాల్లో మూడు వికెట్లు కోల్పోయినప్పటికీ మరో ఓవర్ మిగిలి ఉండగానే 150/7 స్కోరు చేసి గెలిచింది. యువ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ మెరుపు అర్ధ శతకంతో భారత్ ను ఆదుకుంది. 

మైదానంలో నువ్వా? నేనా? అన్నట్టు తలపడ్డ భారత్, పాకిస్థాన్ క్రికెటర్లు ఆట అనంతరం స్నేహితులుగా మారిపోయారు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరు జట్ల క్రీడాకారులంతా స్టేడియంలో ఒక్క చోటుకు చేరారు. సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. జోకులు వేసుకుంటూ హాయిగా నవ్వుకున్నారు. ఇరు దేశాల కెప్టెన్లు తమ జెర్సీలను ఒకరికొకరు బహుమతిగా ఇచ్చుకున్నారు. తాము మైదానంలోనే ప్రత్యర్థులమని, ఆట ముగిశాక స్నేహితులం అని నిరూపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Go Back to Shorts
T20 World Cup
India
Pakistan
Cricketers

More Telugu News