సరికొత్త పాత్రలోకి దిగ్గజ క్రికెటర్ మిథాలీ రాజ్
- గుజరాత్ జెయింట్స్ మెంటార్ గా మిథాలీ
- మహిళల ఐపీఎల్ లో జట్టును మార్గనిర్దేశం చేయనున్న దిగ్గజ క్రికెటర్
- వచ్చే నెలలో మొదలవనున్న మహిళల ఐపీఎల్
ఇటీవల జరిగిన మహిళల ఐపీఎల్ ఫ్రాంచైజీల వేలంలో గుజరాత్ ఫ్రాంచైజీని అదానీ గ్రూప్ రూ. 1200 పైచిలుకు కోట్లకు కొనుగోలు చేసింది. కాగా, మహిళల ఐపీఎల్ నిర్వహించడానికి బీసీసీఐ తీసుకున్న చొరవ చాలా బాగుందని మిథాలీ కితాబిచ్చింది. యువ ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు, క్రికెట్ ను జీవనోపాధిగా మార్చుకునేందుకు ఇది దోహదం చేస్తుందని అభిప్రాయపడింది. కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యంతో ఆట మరింత అభివృద్ధి సాధిస్తుందని వ్యాఖ్యానించింది.