బుమ్రా స్థానంలో షమీ!... అధికారికంగా ప్రకటించిన బీసీసీఐ!
- బుమ్రా స్థానంలో షమీని అధికారికంగా ఎంపిక చేసిన బీసీసీఐ
- ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకున్న షమీ
- రిజర్వ్ బెంచ్లో కొత్తగా సిరాజ్, శార్దూల్లకు చోటు
- మార్పుల తర్వాత తుది జట్టును ప్రకటించిన బీసీసీఐ
టీ20 వరల్డ్ కప్కు ఇదివరకు బీసీసీఐ ప్రకటించిన జట్టులో రిజర్వ్ బెంచ్లో షమీ ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా బుమ్రా స్థానంలో అతడు తుది జట్టులోకి ఎంపిక కాగా... మరో ఇద్దరు బౌలర్లు మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్లను బీసీసీఐ రిజర్వ్ బెంచ్లోకి ఎంపిక చేసింది. వీరిద్దరూ త్వరలోనే ఆస్ట్రేలియా బయలుదేరతారని బీసీసీఐ వెల్లడించింది.
తాజాగా మార్పులు చేర్పుల తర్వాత టీ20 వరల్డ్ కప్లో పాల్గొనే భారత తుది జట్టును కూడా బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హూడా, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్దీప్ సింగ్, మహ్మద్ షమీలు తుది జట్టులో ఉన్నారు.