ఆసియాకప్: టీమిండియాతో మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్
- అప్రాధాన్య మ్యాచ్ లో భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆఫ్ఘన్
- టోర్నీ నుంచి ఇప్పటికే నిష్క్రమించిన టీమిండియా
- రోహిత్, చహల్, పాండ్యాలకు విశ్రాంతి
ఇక, నేటి మ్యాచ్ విషయానికొస్తే... ఆఫ్ఘనిస్థాన్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియా మొదట బ్యాటింగ్ చేయనుంది. కాగా, ఈ మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, యజువేంద్ర చహల్ ఆడడంలేదు. వారి స్థానంలో దీపక్ చహర్, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్ తుదిజట్టులోకి వచ్చారు. రోహిత్ స్థానంలో కేఎల్ రాహుల్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.