Telangana: తెలంగాణలో తాజాగా 345 కరోనా కేసులు

Telangana state corona report
  • గత 24 గంటల్లో 23,780 కరోనా పరీక్షలు
  • హైదరాబాదులో 146 మందికి పాజిటివ్
  • కరోనా నుంచి కోలుకున్న 265 మంది
  • ఇంకా 2,752 మందికి చికిత్స
  • తాజా మరణాలు నిల్ 
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 23,780 శాంపిల్స్ పరీక్షించగా, 345 మందికి కరోనా పాజిటివ్ గా వెల్లడైంది. హైదరాబాదులో అత్యధికంగా 146 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 32, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 17 కేసులు గుర్తించారు. అదే సమయంలో 265 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు. 

తెలంగాణలో ఇప్పటివరకు 8,32,219 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,25,356 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,752 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మృతి చెందారు.
Telangana
Corona Virus
Report
New Cases

More Telugu News