కోడ‌లిని న‌రికి చంపి... త‌ల‌తో పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లిన అత్త‌

mother in law kills niece in annamayya district
  • అన్న‌మ‌య్య జిల్లా రాయ‌చోటి మండ‌లం కె.రామాపురంలో ఘ‌ట‌న‌
  • కోడ‌లు వ‌సుంధ‌ర‌ను చంపేసిన అత్త సుబ్బ‌మ్మ‌
  • కుటుంబ క‌ల‌హాలే కార‌ణ‌మ‌ని వెల్ల‌డించిన హంత‌కురాలు
ఏపీలోని అన్న‌మ‌య్య జిల్లాలో గురువారం దారుణం చోటుచేసుకుంది. కోడ‌లి త‌లన‌రికి చంపిన అత్త... ఆ త‌ర్వాత కోడ‌లి త‌ల‌ను చేతిలో ప‌ట్టుకుని పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి లొంగిపోయింది. అంతేకాకుండా త‌న కోడ‌లిని తానే హ‌త్య చేశానంటూ పోలీసుల ఎదుట నిర్భ‌యంగా నేరాన్ని ఒప్పుకుంది. 

ఈ ఘ‌ట‌న పూర్తి వివ‌రాల్లోకెళితే... జిల్లాలోని రాయ‌చోటి మండ‌లం కె.రామాపురంలో సుబ్బ‌మ్మ నివ‌సిస్తోంది. కోడ‌లు వ‌సుంధ‌ర (35)తో ఆమెకు గ‌త కొంత‌కాలంగా కుటుంబ క‌ల‌హాలు కొన‌సాగుతున్నాయి. ఈ క్ర‌మంలో గురువారం ఆవేశంతో ఊగిపోయిన సుబ్బ‌మ్మ‌... కోడ‌లు వ‌సుంధ‌ర‌పై దాడికి దిగింది. క‌త్తి తీసుకుని వ‌సుంధ‌ర త‌ల న‌రికేసింది. 

ఆ వెంటనే, తెగి ప‌డిన వ‌సుంధ‌ర త‌ల‌ను చేత బ‌ట్టుకుని పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లింది. త‌న కోడ‌లిని తానే హ‌త్య చేశాన‌ని పోలీసుల‌కు చెప్పింది. కోడ‌లి త‌ల‌తో సుబ్బ‌మ్మ అలా న‌డుచుకుంటూ వెళుతుంటే... జ‌నం బెంబేలెత్తిపోయారు.
Go Back to Shorts
Annamayya District
Andhra Pradesh
Crime News
Rayachoti

More Telugu News