తెలంగాణకు హై పవర్ కమిటీని పంపిస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా
- వరద నష్టంపై అంచనా వేసి కేంద్రానికి నివేదికను సమర్పించనున్న కమిటీ
- నిన్న అమిత్ షాను కలిసిన తరుణ్ చుగ్, బండి సంజయ్
- వర్షాలు, వరదల వల్ల ప్రజల ఇబ్బందిని షాకు వివరించిన నేతలు
దీనిపై అమిత్ షా వెంటనే స్పందించారు. హోంశాఖ ఆధ్వర్యంలోని ఉన్నతస్థాయి బృందాన్ని తక్షణమే తెలంగాణకు పంపాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. త్వరలో రాష్ట్రంలో పర్యటించి నష్టాన్ని అంచనా వేయాలని సూచించారని బండి సంజయ్ తెలిపారు. భారీ వర్షాలతో పంటలు, ఇళ్లు దెబ్బతిని ప్రజలతో పాటు వివిధ ప్రాజెక్టులకు జరిగిన నష్టాన్ని ఓపికగా విన్న అమిత్ షాకు సంజయ్ ధన్యవాదాలు తెలిపారు.