సీతాఫ‌ల్‌మండీ స‌ర్కారీ విద్యాల‌యాల అభివృద్ధికి రూ.29 కోట్లు విడుద‌ల చేసిన కేసీఆర్‌

telangana government releases 29 crore rupees for development of government school and colleges in Seethaphalmandi area
  • నిధులు విడుద‌ల చేస్తూ తెలంగాణ స‌ర్కారు ఉత్త‌ర్వుల జారీ
  • కేసీఆర్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన జీహెచ్ఎంసీ కార్పొరేట‌ర్ హేమ శ్యామ‌ల‌
  • డిప్యూటీ స్పీక‌ర్‌తో క‌లిసి ప్రగతి భవన్ కు వెళ్లిన కార్పొరేటర్ 
సికింద్రాబాద్ ప‌రిధిలోని సీతాఫ‌ల్‌మండీకి చెందిన 3 ప్ర‌భుత్వ విద్యాల‌యాల అభివృద్ధి కోసం తెలంగాణ స‌ర్కారు ఏకంగా రూ.29 కోట్ల‌ను విడుద‌ల చేసింది. ఈ మేర‌కు బుధ‌వారం కేసీఆర్ స‌ర్కారు నిధులను విడుద‌ల చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ నిధుల్లో సీతాఫ‌ల్‌మండీ ప్ర‌భుత్వ పాఠ‌శాల అభివృద్ధికి రూ.14 కోట్లు, జూనియ‌ర్ క‌ళాశాల‌కు రూ.6 కోట్లు, డిగ్రీ క‌ళాశాల‌కు రూ.9 కోట్ల‌ను కేటాయిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. 

3 విద్యాల‌యాల అభివృద్ది కోసం ఏకంగా రూ.29 కోట్ల‌ను విడుద‌ల చేసిన సీఎం కేసీఆర్‌కు టీఆర్ఎస్ జీహెచ్ఎంసీ కార్పొరేట‌ర్ హేమ శ్యామ‌ల ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్న తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద్మారావు గౌడ్‌తో క‌లిసి ఈ రోజు ఆమె ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు వెళ్లారు. 35 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని విద్యాల‌యాల కోసం నిధులు విడుద‌ల చేసినందుకు కేసీఆర్‌కు ఆమె కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.
Go Back to Shorts
Telangana
TRS
KCR
Seethaphalmandi
Hema Samala

More Telugu News