మాజీ క్రికెటర్లు, అంపైర్ల పింఛను మొత్తాన్ని భారీగా పెంచిన బీసీసీఐ
- కొత్త పెన్షన్ స్కీమ్ తీసుకువచ్చిన బీసీసీఐ
- దాదాపు రెట్టింపైన పింఛన్లు
- మాజీల క్షేమం తమకు ముఖ్యమన్న గంగూలీ
- అదే అభిప్రాయం వ్యక్తం చేసిన జై షా
బీసీసీఐ కార్యదర్శి జై షా కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. భారత క్రికెట్ కు వారు అందించిన సేవలకు ఈ విధంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని తెలిపారు. దాదాపు 900 మంది వరకు తాజా పెన్షన్ స్కీమ్ ద్వారా లబ్ది పొందుతారని, వారిలో 75 శాతం మంది వందశాతం పెన్షన్ పెంపు ప్రయోజనం అందుకుంటారని జై షా వివరించారు.
ఇప్పటిదాకా నెలకు రూ.15 వేలు అందుకునేవారు ఇకపై రూ.30 వేలు... రూ.22,500 అందుకునేవారు ఇకపై రూ.45,000... రూ.30 వేలు అందుకునేవారు ఇకపై రూ.52 వేలు... రూ.37,500 అందుకునేవారు ఇకపై రూ.60,000... రూ.50,000 అందుకునేవారు రూ.70,000 పెన్షన్ అందుకోనున్నారు.