క్షమాపణలు చెప్పాల్సింది భారత్ కాదు, బీజేపీ చెప్పాలి: కేటీఆర్
- మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతల అనుచిత వ్యాఖ్యలు
- వారిపై సస్సెన్షన్ వేటు వేసిన బీజేపీ
- అంతర్జాతీయ సమాజానికి భారత్ ఎందుకు క్షమాపణ చెప్పాలన్న కేటీఆర్
- ముందుగా భారతీయులకు బీజేపీ క్షమాపణ చెప్పాలని డిమాండ్
బీజేపీ నేతలు చేసిన విద్వేష వ్యాఖ్యలకు అంతర్జాతీయ సమాజానికి భారత దేశం ఎందుకు క్షమాపణలు చెప్పాలంటూ మోదీని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో బీజేపీ క్షమాపణలు చెప్పాలని, ఓ దేశంగా భారత్ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. 'నిత్యం విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్న బీజేపీ నేతలు తొలుత భారతీయులకు క్షమాపణలు చెప్పాలి' అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.