జడ్జీలపై అనుచిత వ్యాఖ్యల కేసు.. ఇద్దరు న్యాయవాదులకు బెయిల్
- ప్రతి సోమవారం సంతకం చేయాలంటూ షరతు
- ఇప్పటికే పలువురు నిందితుల అరెస్ట్
- మరికొందరి కోసం సీబీఐ గాలింపు
జగన్ సర్కారుకు వ్యతిరేకంగా తీర్పులు వస్తున్నాయంటూ గతంలో వైసీపీ అనుకూలురతో పాటు పలువురు హైకోర్టు న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదికగా జరిగిన ఈ తతంగం నాడు పెను దుమారమే రేపింది. ఈ కేసు స్వయంగా హైకోర్టే సీబీఐకి అప్పగించింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే పలువురు నిందితులను సీబీఐ అరెస్ట్ చేసింది. మరికొందరి కోసం గాలిస్తోంది. ఇలా సీబీఐ అరెస్ట్ చేసిన వారిలో ఇద్దరు న్యాయవాదులకు శుక్రవారం హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.