ఏపీలో మరో 1,891 కరోనా పాజిటివ్ కేసులు

AP Corona Media Bulletin
  • గత 24 గంటల్లో 26,236 కరోనా పరీక్షలు
  • తూర్పు గోదావరి జిల్లాలో 440 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ఐదుగురి మృతి
  • ఇంకా 54,040 మందికి చికిత్స
ఏపీలో గడచిన 24 గంటల్లో 26,236 శాంపిల్స్ పరీక్షించగా... 1,891 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 440 కొత్త కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో 356, గుంటూరు జిల్లాలో 222, పశ్చిమ గోదావరి జిల్లాలో 186, ప్రకాశం జిల్లాలో 141, విశాఖ జిల్లాలో 121 కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో 10,241 మంది కరోనా నుంచి కోలుకోగా, ఐదుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,06,943 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 22,38,226 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 54,040 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,677కి పెరిగింది.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Bulletin
Media Report
Today Cases

More Telugu News