తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోయిస్టుల మృతి

Encounter in telangana 6 maoists dead
  • ఈ ఉదయం 6-7.30 గంటల ప్రాంతంలో ఘటన
  • మృతి చెందిన మావోల్లో నలుగురు మహిళా నక్సలైట్లు
  • చర్ల ఏరియా మిలీషియా కమాండర్ మధు కూడా మృతి
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో తెలంగాణ గ్రేహౌండ్స్, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.

చర్ల మండలానికి 25 కిలోమీటర్ల దూరంలోని కుర్ణవల్లి, పెసలపాడు అటవీ ప్రాంతంలో ఈ తెల్లవారుజామున 6-7.30 గంటల మధ్య ఈ ఎన్‌‌కౌంటర్ జరిగినట్టు తెలుస్తోంది. మృతి చెందిన మావోయిస్టుల్లో నలుగురు మహిళా నక్సల్స్‌తోపాటు చర్ల ఏరియా మిలీషియా కమాండర్ మధు కూడా మృతి చెందారు. కాగా, ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Chhattisgarh
Telangana
Encounter
Maoists

More Telugu News