తెలంగాణ సీఎస్ కు రూ.10 వేలు జరిమానా విధించిన తెలంగాణ హైకోర్టు
- 2016లో జీవో.123 జారీ
- జీవోను వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్లు
- కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించిన కోర్టు
- రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతున్న సీఎస్
ఈ జరిమానాను ప్రధానమంత్రి కొవిడ్ రిలీఫ్ ఫండ్ కు జమ చేయాలని పేర్కొంది. అంతేకాదు, తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. తదుపరి విచారణను 2022 జనవరి 24కి వాయిదా వేసింది.
2016లో నీటి పారుదల ప్రాజెక్టుల కోసం జీవో నెం.123 జారీ అయింది. సాగునీటి పథకాలకు భూసేకరణ నిమిత్తం అప్పట్లో ఈ జీవో తీసుకువచ్చారు. అయితే ఈ జీవోకు వ్యతిరేకంగా పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వారి పిటిషన్లపై విచారణ చేపట్టిన ప్రతి సందర్భంలోనూ కౌంటర్ దాఖలు చేయాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతున్న సీఎస్ ను కోర్టు ఆదేశిస్తూ వస్తోంది. వ్యక్తిగతంగానూ హాజరు కావాలని సూచిస్తోంది. అయినప్పటికీ స్పందన లేకపోవడంతో తాజాగా జరిమానా విధించింది.