వరదలు తగ్గిన తర్వాత తిరుపతి ప్రజలకు కొత్త సమస్యలు!
- తిరుపతిలో వరద బీభత్సం
- రోజుల తరబడి నీళ్లలో నానిన ఇళ్లు
- భూమిలోంచి పైకిలేచిన ట్యాంకు
- పలు ఇళ్లకు బీటలు
తాజాగా తిరుపతి శ్రీకృష్ణ నగర్ లో 18 ఇళ్లు బీటలు వారాయి. దాంతో ప్రజలు ఆ ఇళ్ల నుంచి బయటికి వచ్చేశారు. ఆ ఇళ్లు కొద్దిమేర కుంగిపోయాయని కూడా స్థానికులు చెబుతున్నారు. దీనిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
ఈ ఘటనలపై శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం భూగర్భ శాస్త్ర అసోసియేట్ ప్రొఫెసర్ మధు వివరణ ఇచ్చారు. ఈ నిర్మాణాలు ఓ కాలువపై నిర్మించినట్టు తెలిసిందని, భూగర్భ పొరల్లో ఇసుక ఉన్నందున, వరద ప్రభావంతో భూగర్భ నీటి మట్టం పెరిగి ట్యాంకు పైకి లేచి ఉంటుందని వివరించారు.