ఒకప్పుడు తెలంగాణ మంత్రి పదవి రేసులో ఉన్న కేరళ ఐపీఎస్ తప్పుదోవ.. సస్పెండ్ చేసిన సీఎం విజయన్
- మోసగాడికి అండగా ఉన్నాడని ఆరోపణలు
- విచారణలో నిగ్గు తేల్చిన అధికారులు
- సస్పెన్షన్ కు ఆమోద ముద్ర వేసిన కేరళ సీఎం
పురావస్తు డీలర్ నని చెప్పుకొన్న మాన్షన్ మావుంకల్ అనే ఓ మోసగాడికి లక్ష్మణ్ నాయక్ సహకారం అందించారని అధికారులు నిర్ధారించారు. మాన్షన్ చాలా మంది దగ్గర రూ.కోట్లు వసూలు చేసి కుచ్చుటోపీ పెట్టినట్టు తేల్చారు. మాన్షన్ వద్ద ఉన్న వస్తువులను విక్రయించేందుకు ఏపీకి చెందిన ఓ మహిళను లక్ష్మణ్ పరిచయం చేసినట్టు అధికారులు గుర్తించారు. కాగా, ఐజీతో ఉన్న పరిచయం ఆధారంగా మాన్షన్ తన వ్యాపారాన్ని పెంచుకున్నాడని, తమను మోసం చేసి కోట్లు కొల్లగొట్టారని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంకో విషయమేంటంటే.. ఒకానొక దశలో ఆయన తెలంగాణ మంత్రి పదవి రేసులో కూడా ఉన్నారట.