టీ20 వరల్డ్ కప్: స్కాట్లాండ్ తో పోరు... టాస్ టీమిండియాదే!
- దుబాయ్ లో మ్యాచ్
- గ్రూప్-2లో మరో పోరు
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
- మరో మ్యాచ్ లో నమీబియాపై కివీస్ విజయం
ఇక, పసికూన స్కాట్లాండ్ పై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. భారత్ పై విజయమే లక్ష్యంగా బరిలో దిగుతామని స్కాట్లాండ్ కెప్టెన్ కైల్ కోయెట్జర్ చెప్పినా, కసితో రగిలిపోతున్న కోహ్లీ సేనను నిలువరించడం ఆ జట్టుకు శక్తికి మించిన పనే!
నమీబియాపై కివీస్ విజయం... టీమిండియా అభిమానులకు నిరాశ
సూపర్-12 దశ గ్రూప్-2లో భాగంగా షార్జాలో నేడు న్యూజిలాండ్, నమీబియా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ పోరులో న్యూజిలాండ్ 52 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 163 పరుగులు చేయగా, లక్ష్యఛేదనలో నమీబియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 111 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఓడితే బాగుండు... టీమిండియా సెమీస్ బెర్తుకు ఓ అడ్డంకి తొలగిపోతుందని భావించిన భారత అభిమానులు తాజా ఫలితంతో నిరాశకు గురయ్యారు. నమీబియాతో పోరులో న్యూజిలాండ్ గెలవడమే కాదు, నెట్ రన్ రేట్ ను కూడా భారీగా మెరుగుపర్చుకుంది.