కర్నూలు జిల్లాలో రేపు, ఎల్లుండి కేఆర్ఎంబీ బృందం పర్యటన
- గెజిట్ నోటిఫికేషన్ పై ఏపీ సర్కారు జీవో
- రెండ్రోజుల పర్యటనకు కర్నూలు జిల్లా వస్తున్న కేఆర్ఎంబీ
- ప్రాజెక్టులు, విద్యుదుత్పత్తి కేంద్రాల పరిశీలన
- కేఆర్ఎంబీ కమిటీలో పదిమంది సభ్యులు
రేపు మల్యాల, ముచ్చుమర్రి, హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకాలు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ను సందర్శించనుంది. ఎల్లుండి శ్రీశైలం ప్రాజెక్టు విద్యుదుత్పత్తి కేంద్రాలను పరిశీలించనుంది. కేఆర్ఎంబీ కమిటీలో ఏపీ, తెలంగాణ, జెన్ కో అధికారులు సహా మొత్తం 10 మంది సభ్యులు ఉంటారు.