కాబూల్ లో మసీదు వద్ద భారీ పేలుడు... 14 మంది మృతి
- ఆఫ్ఘనిస్థాన్ రాజధానిలో భారీ విస్ఫోటనం
- ఈద్గా మసీదు వద్ద ఘటన
- ఘటనను నిర్ధారించిన తాలిబన్లు
- మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
గతవారం జబీహుల్లా ముజాహిద్ తల్లి మరణించగా, ఆమె మరణానంతర ప్రార్థనలు మసీదులో నిర్వహిస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది.
కాగా, అహ్మదుల్లా అనే దుకాణదారు ఈ పేలుడు ఘటనకు ప్రత్యక్షసాక్షిగా నిలిచాడు. ఈ పేలుడు ఘటనకు కొద్దిముందుగా తాలిబన్లు ఈ మసీదు రోడ్డును మూసివేసి జబీహుల్లా ముజాహిద్ తల్లి సంస్మరణ ప్రార్థనలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారని అహ్మదుల్లా వివరించాడు. ఈద్గా మసీదు వద్ద భారీ శబ్దం వినిపించిందని, ఆపై తుపాకీ కాల్పుల మోత వినిపించిందని తెలిపాడు.