ముగ్గురు ఆడపిల్లల్ని కన్నదన్న కోపంతో.. భార్య, పిల్లలను బావిలోకి తోసేసిన భర్త
- ఎనిమిదేళ్ల పెద్దమ్మాయి మృతి
- 6 నెలల పసికందుతో బయటపడిన మహిళ
- మధ్యప్రదేశ్ లోని ఛాతర్ పూర్ లో ఘటన
పుట్టింటికెళ్లి తన భార్యాపిల్లలను తీసుకొచ్చే క్రమంలో ఛాతర్ పూర్ లోని బావి వద్ద బైక్ ను ఆపిన అతడు.. ముగ్గుర్నీ బావిలోకి తోసేశాడు. అనంతరం అక్కడ్నుంచి పరారయ్యాడు. భార్య ఎలాగోలా బయటపడి గ్రామస్థుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. మగపిల్లాడిని కనలేదన్న కోపంతో గత కొంతకాలంగా భార్యను, పిల్లలను చంపేస్తానంటూ అతడు బెదిరిస్తున్నాడని పోలీసులు తెలిపారు. పారిపోయిన నిందితుడి కోసం గాలిస్తున్నామన్నారు. కాగా, మరో అమ్మాయి మాత్రం వీరితో రాకుండా అమ్మమ్మ దగ్గరే ఉండిపోయింది.