Prasanna Kumar Reddy: పెను ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి
నెల్లూరు జిల్లా కోవూరు వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొట్టింది. ఈ ఘటన ఇనమడుగు క్రాస్ రోడ్డు సమీపంలో జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ప్రసన్నకుమార్ రెడ్డి కారు వెనుక భాగం పూర్తిగా ధ్వంసమైంది.
ప్రమాద సమయంలో కారులో ఆయనతో పాటు విజయా డెయిరీ ఛైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి కూడా ఉన్నారు. వీరిద్దరూ కూడా సురక్షితంగా బయటపడ్డారు. ఈ సందర్భంగా ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ, దేవుడి దయ వల్లే ప్రాణాలతో బయటపడ్డామని చెప్పారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రమాద సమయంలో కారులో ఆయనతో పాటు విజయా డెయిరీ ఛైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి కూడా ఉన్నారు. వీరిద్దరూ కూడా సురక్షితంగా బయటపడ్డారు. ఈ సందర్భంగా ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ, దేవుడి దయ వల్లే ప్రాణాలతో బయటపడ్డామని చెప్పారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.