Kadapa District: క‌డ‌ప జిల్లాలో పేలుడు.. 9 మంది మృతి.. తునాతున‌క‌లైన మృత‌దేహాలు

  • క‌ల‌స‌పాడు మండ‌లం మామిళ్ల‌ప‌ల్లె శివారులో ఘ‌ట‌న‌
  • జిలెటిన్‌స్టిక్స్ ను వాహ‌నంలో తీసుకొస్తుండ‌గా ప్ర‌మాద‌వ‌శాత్తు పేలుడు
  • బ‌ద్వేలు నుంచి ముగ్గురాళ్ల‌గ‌నికి  త‌ర‌లిస్తుండ‌గా ఘ‌ట‌న
blast in kadapa

క‌డ‌ప జిల్లాలో క‌ల‌కలం చెల‌రేగింది. భారీ పేలుడు సంభ‌వించి  తొమ్మిది మంది అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. వారి మృత‌దేహాలు తునాతున‌క‌లయ్యాయి. ఈ ఘ‌ట‌న‌లో మ‌రికొంత మందికి గాయాల‌య్యాయి. వారిని ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించిన పోలీసులు చికిత్స అందిస్తున్నారు.

క‌డ‌ప జిల్లా క‌ల‌స‌పాడు మండ‌లం మామిళ్ల‌ప‌ల్లె శివారులో ఈ రోజు ఉద‌యం ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. జిలెటిన్‌స్టిక్స్ ను వాహ‌నంలో తీసుకొస్తుండ‌గా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంద‌ని తెలిసింది. ప్ర‌మాద‌వ‌శాత్తు వాహ‌నంలో జిలెటిన్‌స్టిక్స్ పేలాయి. బ‌ద్వేలు నుంచి ముగ్గురాళ్ల‌గ‌నికి జిలెటిన్‌స్టిక్స్ త‌ర‌లిస్తుండ‌గా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి స‌మాచారం అందాల్సి ఉంది.

More Telugu News