కార్మికులు తమ హక్కుల కోసం రక్తం చిందించిన రోజు మే డే: పవన్ కల్యాణ్
- ప్రపంచ పురోగతిలో శ్రమజీవుల పాత్ర ఎనలేనిది
- కష్ట జీవులు మరోసారి పోరాటానికి దిగే పరిస్థితి రాకూడదు
- కార్మిక లోకానికి 'మే డే' శుభాకాంక్షలు
పరిశ్రమల్లో, వాణిజ్య సంస్థల్లో పని చేస్తున్న వారి నుంచి అసంఘటిత రంగాల్లో ఉన్న వారందరికీ కార్మిక చట్టాలు పకడ్బందీగా అమలు కావాలన్నది జనసేన పార్టీ ఆకాంక్ష అని పవన్ తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో కార్మికులకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని... ఆ కష్ట జీవుల కుటుంబాలను తక్షణం ఆదుకోవాల్సిన బాధ్యత పాలకులపై ఉందని చెప్పారు. ఆరోగ్యపరంగా వారికి అవసరమైన అన్ని సేవలను సక్రమంగా అందించాలని డిమాండ్ చేశారు.