Corona Virus: ఏపీలో కొనసాగుతున్న కరోనా బీభత్సం... 51 మంది మృతి

  • గత 24 గంటల్లో 74,041 కరోనా పరీక్షలు
  • 9,881 మందికి పాజిటివ్
  • నెల్లూరు జిల్లాలో 1,592 కొత్త కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 4,431 మంది
  • యాక్టివ్ కేసుల సంఖ్య 95,131
Corona scares continues in AP

ఏపీలో కరోనా మహమ్మారి ఉద్ధృతంగా వ్యాపిస్తోంది. గడచిన 24 గంటల్లో 74,041 కరోనా పరీక్షలు నిర్వహించగా 9,881 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 1,592 కొత్త కేసులు నమోదు కాగా, తూర్పు గోదావరి జిల్లాలో 1,302 కేసులు, గుంటూరు జిల్లాలో 1,048 కేసులు, విశాఖ జిల్లాలో 1,030 కేసులు గుర్తించారు.

అదే సమయంలో 4,431 మంది కరోనా నుంచి కోలుకోగా, 51 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 10,43,441 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 9,40,574 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 95,131 మందికి చికిత్స జరుగుతోంది. అటు, కరోనా మృతుల సంఖ్య 7,736కి పెరిగింది.

More Telugu News