చత్తీస్ గఢ్ లో మరోసారి మావోల ఘాతుకం... ఈసారి మందుపేతర పేల్చిన వైనం
- చత్తీస్ గఢ్ లో నిన్న భారీ ఎన్ కౌంటర్
- ఇప్పటివరకు 24 జవాన్ల మృతదేహాలు స్వాధీనం
- కొనసాగుతున్న గాలింపు చర్యలు
- భద్రతా బలగాలే లక్ష్యంగా మందుపాతర పేల్చిన నక్సల్స్
కాగా, నిన్నటి ఎన్ కౌంటర్ లో మృతి చెందిన జవాన్ల సంఖ్య 24కి పెరిగింది. మృతుల్లో 9 మంది కోబ్రా దళాలకు చెందినవారు కాగా, 8 మంది డీఆర్జీ సిబ్బంది, ఆరుగురు ఎస్పీఎఫ్ సిబ్బంది, ఓ బస్తర్ బెటాలియన్ జవాను ఉన్నారు. నక్సల్స్ దాడిలో 31 మంది జవాన్లకు గాయాలయ్యాయి. గాయపడిన వారిలో 16 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది ఉన్నారు. తీవ్రంగా గాయపడిన జవాన్లలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. అటు, నక్సల్స్ దాడి ఘటనలో గల్లంతైన జవాన్ల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.