స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు బరితెగించిపోయాడు: విజయసాయిరెడ్డి
- చంద్రబాబుపై విజయసాయి విమర్శలు
- చంద్రబాబు నేడు అనామకుడిలా మారిపోయాడని వ్యాఖ్యలు
- తన పరిస్థితిని జీర్ణించుకోలేకపోతున్నాడని కామెంట్
- అందుకే జగన్ ను తిడుతున్నాడని ఆరోపణ
అటు సీఎం జగన్ పైనా ప్రశంసలు కురిపించారు. సేవ చేసేందుకే రాజకీయ పార్టీలు స్థాపిస్తుంటారని, అయితే ప్రజావిశ్వాసం చూరగొని అధికారంలోకి రాగలిగితేనే ఆపన్నులను ఆదుకునే అవకాశం దొరుకుతుందని అభిప్రాయపడ్డారు. చాలామంది గెలిచాక చేద్దాం, చూద్దాం అనుకుంటుంటారని, కానీ 20 నెలల్లో రూ.80 వేల కోట్లతో సంక్షేమ పథకాలు అమలు చేయడం జగన్ కు మాత్రమే సాధ్యమైందని కొనియాడారు.