నిర్మలా సీతారామన్ తో భేటీ అయిన టీడీపీ ఎంపీలు
- విశాఖ స్టీల్ ప్లాంట్ విషయాన్ని పునఃపరిశీలించాలన్న ఎంపీలు
- ప్లాంట్ కు గనులను కేటాయించాలని విన్నపం
- వాజ్ పేయి చూపించిన చొరవను మళ్లీ చూపించాలన్న ఎంపీలు
విశాఖ ప్లాంట్ కు ప్రత్యేక ఇనుప ఖనిజ గనులను కేటాయించాలని కోరారు. విశాఖ ఉక్కును ఆదుకునేందుకు గతంలో అప్పటి ప్రధాని వాజ్ పేయి చొరవ చూపారని... ఇప్పుడు అదే చొరవను చూపాలని విన్నవించారు. ఈ మేరకు ఆమెకు వినతి పత్రాన్ని కూడా సమర్పించారు. నిర్మలను కలిసిన వారిలో గల్లా జయదేవ్, కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్ ఉన్నారు.