Corona Virus: తెలంగాణ‌లో క‌రోనా కేసుల అప్ డేట్స్

379 new cases in telangana
  • కొత్తగా 379 కరోనా కేసులు
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,88,789
  • కోలుకున్న వారు  2,82,177 మంది
  • మృతుల సంఖ్య 1,559
తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 379 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 305 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,88,789కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,82,177 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య  1,559కి పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం 5,053 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 2,776 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 71 కరోనా కేసులు నమోదయ్యాయి.

  
Corona Virus
COVID19
Telangana

More Telugu News