నిరసనల వేళ రహదారులపై క్రికెట్ ఆడిన రైతన్నలు!
- వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు
- ఇవాళ నిరాహార దీక్ష చేపట్టిన రైతులు
- దీక్షలో పాల్గొన్న 32 సంఘాల నేతలు
- రోడ్లనే మైదానాలుగా భావించి క్రికెట్ ఆడిన రైతులు
- నెట్టింట సందడి చేస్తున్న ఫొటోలు, వీడియోలు
రైతుల నిరసనలకు నేడు 19వ రోజు కాగా, ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో 32 రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. కాగా, పలు చోట్ల రైతులు క్రికెట్ ఆడారు. ఢిల్లీ-హర్యానా హైవే పైనా, ఘాజీపూర్ బోర్డర్ వద్ద ఉల్లాసంగా క్రికెట్ ఆడారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి.