క్రికెటర్ శిఖర్ ధావన్ భావోద్వేగభరిత పోస్ట్!
- టీమిండియా జెర్సీ వేసుకొని నేటికి పదేళ్లు
- దేశం కోసం ఆడుతున్నా
- ఇంతకంటే గొప్ప గౌరవం మరొకటి ఉండదు
అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు శిఖర్ ధావన్ పేర్కొన్నాడు. కాగా, నిన్న ఐపీఎల్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 164 పరుగులు చేయగా, వాటిలో 106 పరుగులు శిఖర్ ధావనే చేసిన విషయం తెలిసిందే. దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ ఆయన గతంలో టీమిండియాను చాలా సార్లు గెలిపించాడు.