బీచ్ లో అంబ‌రాన్నంటే ఆనందంతో ముంబై ఇండియ‌న్స్ ఎంజాయ్.. ఫొటోలు ఇవిగో

mumbai indians enjoys in beach
ఐపీఎల్ లో ఆడ‌డానికి ఇప్ప‌టికే యూఏఈ చేరుకున్న ముంబయి ఇండియన్స్ అక్క‌డి బీచ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కూడా అక్క‌డి బీచ్ లో భార్యాపిల్ల‌ల‌తో ఎంజాయ్ చేసి, ఇందుకు సంబంధించిన ఫొటోల‌ను ఆయ‌న త‌న సామాజిక మాధ్యమాల ఖాతాల్లో పోస్ట్ చేశాడు.
                   
అక్కడికి వెళ్లిన అనంత‌రం కొన్నిరోజులు క్వారంటైన్‌ నిబంధనల మధ్య క్రికెట్ ప్రాక్టీస్ చేసిన క్రికెట‌ర్లు కాస్త విరామం దొర‌క‌డంతో అక్క‌డి పర్యాట‌క ప్ర‌దేశాల్లో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే రోహిత్ ఇలా ఎంజాయ్ చేశాడు. ఆయ‌నే కాకుండా ముంబై ఇండియ‌న్స్ ఇత‌ర ఆట‌గాళ్లు కూడా బీచ్ లో ఎంజాయ్ చేశారు.  ఇందుకు సంబంధించిన ఫొటోలను ముంబయి ఇండియన్స్ త‌మ అధికారిక‌ ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
                     
Go Back to Shorts
mumbai indians
IPL 2020
Cricket

More Telugu News