బీసీసీఐ కరోనా టాస్క్ ఫోర్స్ కు రాహుల్ ద్రావిడ్ నాయకత్వం
- క్రికెట్ కార్యకలాపాలు ప్రారంభించనున్న బీసీసీఐ!
- ఆటగాళ్లలో అవగాహన కల్పించేందుకు టాస్క్ ఫోర్స్
- రాష్ట్రాల క్రికెట్ సంఘాలకు ఎస్ఓపీ పంపిన బీసీసీఐ
ఎస్ఓపీని అనుసరించి క్రికెట్ సాధన షురూ చేసే ఆటగాళ్లు బీసీసీఐ కరోనా ప్రోటోకాల్ ను అంగీకరిస్తున్నట్టు ఓ పత్రంపై సంతకం చేయాల్సి ఉంటుంది. ఆటగాళ్ల శిక్షణ శిబిరాల్లో 60 ఏళ్లకు పైబడిన వాళ్లకు ప్రవేశం నిషేధించారు. బీసీసీఐ రూపొందించిన కరోనా ప్రోటోకాల్ సరిగా అమలయ్యేలా చూడడమే ద్రావిడ్ నాయకత్వంలోని కరోనా టాస్క్ ఫోర్స్ ప్రధాన విధి. ఈ టాస్క్ ఫోర్స్ లో ద్రావిడ్ తో పాటు ఓ వైద్య అధికారి, పరిశుభ్రత పర్యవేక్షకుడు, బీసీసీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (క్రికెట్ ఆపరేషన్స్) ఉంటారు. వీరు నిరంతరం ఆటగాళ్లతో మాట్లాడుతూ, కరోనా వ్యాప్తి పట్ల అప్రమత్తం చేస్తూ ఉండాలి.