పురుషులతో పాటే మహిళల ఐపీఎల్... మూడు జట్లతో మ్యాచ్ లు!
- యూఏఈ వేదికగా ఐపీఎల్
- అనుమతించిన కేంద్రం
- మహిళల మ్యాచ్ ల పట్ల సానుకూలంగా స్పందించిన గంగూలీ
కాగా, పురుషుల ఐపీఎల్ లో మహిళల జట్లతోనూ కొన్ని మ్యాచ్ లు నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ కూడా దీనిపై సానుకూల స్పందన వ్యక్తం చేశారు. యూఏఈ వేదికగా జరిగే ఐపీఎల్ లో మహిళల మ్యాచ్ లకు కూడా అవకాశాలు ఉన్నాయని అన్నారు. అయితే ఎన్నిజట్లతో ఆడించాలన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రాథమికంగా మహిళా క్రికెటర్లను మూడు జట్లుగా విభజించి మ్యాచ్ లు ఆడించాలన్నది తమ ఆలోచన అని బోర్డు వర్గాలు తెలిపాయి. ఐపీఎల్ పాలకమండలి సమావేశంలో దీనిపై తుది నిర్ణయం వెలువడనుంది.