ఐపీఎల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం... యూఏఈ వేదికగా లీగ్
- కరోనా వ్యాప్తితో భారత్ నుంచి యూఏఈ తరలివెళ్లిన ఐపీఎల్
- కేంద్రం అనుమతి కోసం వేచిచూస్తున్న యూఏఈ
- కేంద్రం క్లియరెన్స్ ఇవ్వడంతో తొలగిన అడ్డంకులు
అయితే, భారత ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ వచ్చేవరకు తాము లీగ్ ఏర్పాటుపై అంగీకారం తెలుపలేమని యూఏఈ తెలిపింది. ఇప్పుడు భారత ప్రభుత్వం యూఏఈ వేదికగా ఐపీఎల్ నిర్వహణకు ఓకే చెప్పడంతో అతి పెద్ద క్రికెట్ సంబరానికి అడ్డు లేకుండా పోయింది. ఈ టోర్నీ సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు యూఏఈలోని పలు స్టేడియాల్లో జరగనుంది. కాగా, కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని ఒక్కో ఫ్రాంచైజీ 24 మంది ఆటగాళ్లను యూఏఈ తరలించేందుకు అనుమతి ఇచ్చారు.