Cricket: మాంచెస్ట‌ర్ టెస్టులో పొర‌పాటున బంతికి ఉమ్ము రాసిన ఇంగ్లండ్ క్రికెట‌ర్

Umpires disinfect ball after Sibley accidentally uses saliva
కరోనా విజృంభణ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్‌ నిబంధనల్లో పలు మార్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. బంతికి ఉమ్ము రాయ‌కూడ‌ద‌న్న నిబంధ‌న కూడా తీసుకొచ్చారు. అయితే, వెస్టిండీస్‌-ఇంగ్లండ్‌ మధ్య మాంచెస్ట‌ర్‌లో జ‌రుగుతున్న రెండ‌వ టెస్టులో ఇంగ్లండ్ క్రికెట‌ర్ డామ్ సిబ్లే బంతికి ఉమ్ము రాయడంతో ఆ బంతిని అంపైర్లు శానిటైజ్ చేయాల్సి వచ్చింది.

ఆట 4‌వ రోజున ఫీల్డింగ్ చేస్తున్న స‌మ‌యంలో ఇంగ్లండ్‌ ఆటగాడు సిబ్లే పొరపాటున బంతికి ఉమ్ము రాయడంతో, ఈ విషయం ఇంగ్లండ్ టీమ్‌ అంపైర్ల‌కు చెప్ప‌డంతో వారు ఈ జాగ్రత్తలు తీసుకున్నారు. పొరపాటున ఉమ్ము రాసినట్లు సిబ్లే ఒప్పుకున్నాడు. కాగా, బంతికి ఉమ్ము రాయడం క్రికెటర్లకు అలవాటే.

కరోనా విజృంభణ నేపథ్యంలో విధించిన నిబంధనల ప్రకారం.. ఎవరైనా ఉమ్ము రాస్తే ప్ర‌తి జ‌ట్టుకు ఇన్నింగ్స్‌లో 2 సార్లు హెచ్చరిక చేస్తారు. రెండు కంటే అధికసార్లు రాస్తే కనుక, ఆ జ‌ట్టుపై 5 ప‌రుగుల పెనాల్టీ వేస్తారు. కాగా, వెస్టిండీస్‌-ఇంగ్లండ్‌ మధ్య మాంచెస్ట‌ర్‌లో జరుగుతోన్న మ్యాచ్‌లో సిబ్లే తొలి ఇన్నింగ్స్‌లో 120 పరుగులు చేశాడు.
Cricket
england
west indies
Corona Virus

More Telugu News