Krishna River Board: త్వరలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కీలక సమావేశం

Krishna River Board will meet to discuss water issues between two states
షార్ట్స్‌లో చూడండి
ఏపీ, తెలంగాణ మధ్య నదీ జలాల వ్యవహారంలో మరోసారి వివాదం రాజుకుంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచేందుకు ఏపీ సర్కారు జీవో నెం.203 జారీ చేయడం తెలంగాణ వర్గాలను ఆగ్రహావేశాలకు గురిచేసింది. ఈ వ్యవహారంపై స్పందించిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్వరలోనే కీలక సమావేశం నిర్వహించనుంది.

ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదర్చడమే ఈ సమావేశం ప్రధాన అజెండా అని తెలుస్తోంది. ఈ సమావేశంలో... కృష్ణా నదిపై ఏపీ, తెలంగాణ ప్రాజెక్టుల డీపీఆర్ పై చర్చ జరగనుంది. రెండో దశ టెలిమెట్రీ అమలు, ఇతర అంశాలపైనా చర్చించనున్నారు. ఈ మేరకు ప్రతిపాదిత అజెండాను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు రెండు తెలుగు రాష్ట్రాలకు పంపింది. ఇంకా ఏవైనా అంశాలు చర్చకు తీసుకురావాలని అనుకుంటే ఈ నెల 26 లోపు తమకు పంపించాలని బోర్డు కోరింది.
Go Back to Shorts
Krishna River Board
Pothireddypadu
G.O.203
Andhra Pradesh
Telangana

More Telugu News