తూర్పు ఢిల్లీలో మద్యం షాపులు తెరుచుకుని... అంతలోనే మూతపడ్డాయి!
- దేశవ్యాప్తంగా మళ్లీ తెరుచుకున్న మద్యం షాపులు
- మద్యం కోసం బారులు తీరిన ప్రజలు
- తూర్పు ఢిల్లీలో భౌతికదూరం నిబంధన గాలికొదిలేసిన మందుబాబులు
దుకాణదారులు చేతులెత్తేయడంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. కొన్ని దుకాణాల వద్ద లాఠీ చార్జి చేసి మందుబాబులను తరిమేశారు. పరిస్థితి అదుపు తప్పుతుండడంతో ఢిల్లీ తూర్పు ప్రాంతం జాయింట్ కమిషనర్ అలోక్ కుమార్ మద్యం షాపులు మూసేయించారు. దాంతో మద్యం ప్రియులు ఉసూరుమంటూ వెనుదిరిగారు.