మధ్యప్రదేశ్ మంత్రివర్గం విస్తరణ... ఐదుగురి ప్రమాణ స్వీకారం!
- మార్చి 23న సీఎంగా పదవీప్రమాణం చేసిన శివరాజ్ సింగ్ చౌహాన్
- ఇప్పటివరకు మంత్రుల్లేకుండానే పాలన
- కాంగ్రెస్ విమర్శలతో మంత్రుల ఎంపిక
కరోనా విజృంభిస్తుంటే మంత్రులను ఎందుకు ఎంపిక చేయడం లేదంటూ కాంగ్రెస్ అదేపనిగా విమర్శిస్తుండడంతో సీఎం శివరాజ్ సింగ్ తాజా నిర్ణయం తీసుకున్నట్టు అర్థమవుతోంది. రాజ్ భవన్ లో నిరాడంబరంగా జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రులు పదవీప్రమాణం చేశారు. నరోత్తమ్ మిశ్రా, గోవింద్ సింగ్ రాజ్ పుత్, మీనా సింగ్, కమల్ పటేల్, తులసీరామ్ సిలావత్ మంత్రులుగా చాన్స్ దక్కించుకున్నారు.