అభిమానులు లేకుండా టీ20 ప్రపంచకప్పా?: ఊహించుకోలేనన్న బోర్డర్
- క్రీడారంగంపై కరోనా పంజా
- ఈ ఏడాది జరగాల్సిన టీ20 ప్రపంచకప్
- స్టేడియంలో ప్రేక్షకులు లేకుండా మ్యాచ్ లు నిర్వహించాలనే ప్రతిపాదన
ఖాళీ స్టేడియంలలో క్రికెట్ మ్యాచ్ లను అస్సలు ఊహించుకోలేకపోతున్నానని బోర్డర్ అన్నారు. ఈ ప్రతిపాదనను తాను ఒప్పుకోలేనని చెప్పారు. స్టేడియంలో ప్రేక్షకులు లేకపోతే ఆ మ్యాచ్ కు అర్థం ఉండదని... ఇది జరగకూడదనే తాను కోరుకుంటున్నానని తెలిపారు. పరిస్థితి అదుపులోకి రాకపోతే టోర్నీని రద్దు చేసి... మరో సురక్షిత ప్రాంతంలో నిర్వహించాలని సూచించారు.