శబరిమల వివాదంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
- రివ్యూ పిటిషన్లను పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టీకరణ
- వేర్వేరు మతాల్లో మహిళలపై ఉన్న వివక్షపై వాదనలకు ఓకే
- వాదనల అంశాలను తేల్చేందుకు సీనియర్ న్యాయవాదుల సమావేశం
గతంలో ఐదుగురు న్యాయమూర్తులు నివేదించిన అంశాలను మాత్రమే పరిశీలిస్తామని, రివ్యూ పిటిషన్లు మాత్రం కాదని చీఫ్ జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని 9 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ముస్లిం మహిళలకు మసీదుల్లో ప్రవేశం, బోహ్రా ముస్లిం తెగలో బాలికలకు సున్తీ ఆచారం, ఇతర మతస్తులను పెళ్లాడే పార్శీ మహిళలపై ఉన్న ఆంక్షలకు సంబంధించిన పిటిషన్లను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నట్టు న్యాయస్థానం తెలిపింది.