సీఏఏలో పౌరసత్వం తొలగించే నిబంధన ఎక్కడుందో చెప్పాలి: విపక్షాలకు అమిత్ షా సవాల్
- మమతా, రాహుల్ లను కోరిన అమిత్ షా
- సీఏఏపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం
- ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ మండిపాటు
పౌరసత్వ చట్టంపై ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారంటూ మండిపడ్డారు. సీఏఏపై అసత్యప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అణచివేతకు గురైన పాకిస్థానీ శరణార్థులకు భారత పౌరసత్వం ఇవ్వడం తమ ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఒకటి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మతాల ప్రాతిపదికన దేశాన్ని విభజించిందని విమర్శించారు. ఇప్పుడు పాకిస్థాన్ పశ్చిమ, తూర్పు భాగాల్లో నివసించే మైనారిటీలు (హిందువులు, జైనులు, పార్శీలు, సిక్కులు) భారత్ తిరిగి రావాలని కోరుకుంటున్నారని వెల్లడించారు.