నా దశాబ్దాల కల నెరవేరిన క్షణాలివి: అద్వానీ
- చరిత్రాత్మక తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు
- కోట్లాది మంది నమ్మకాలను నిలబెట్టిన తీర్పిది
- అన్ని వర్గాలూ ఒక్కటై సమగ్రతను బలపరచాలన్న అద్వానీ
కోట్లాది మంది నమ్మకాలను నిలుపుతూ వచ్చిన ఈ తీర్పు తనకెంతో సంతోషాన్ని కలిగించిందని, ఇకపై ఎటువంటి హింసకూ తావులేకుండా శాంతిని నెలకొల్పేందుకు కృషి చేయాల్సి వుందని అద్వానీ అభిప్రాయపడ్డారు. అన్ని వర్గాల ప్రజలూ ఒక్కటై దేశ ఐక్యతను, సమగ్రతనూ బలపరచాలని కోరారు. మసీదు నిర్మాణానికి ఐదు ఎకరాలు కేటాయించాలన్న సుప్రీంకోర్టు తీర్పునూ అద్వానీ స్వాగతించారు.