శివసేనకు మద్దతివ్వడంపై శరద్ పవార్ స్పందన
- మమ్మల్ని ప్రతిపక్ష స్థానంలో కూర్చోవాలంటూ ప్రజలు తీర్పును ఇచ్చారు
- ప్రజల అభీష్టం మేరకు ప్రతిపక్షంలోనే ఉంటాం
- శివసేనకు మద్దతుపై మా పార్టీలో చర్చ జరగనే లేదు
ఈ నేపథ్యంలో, తన అంతరంగాన్ని శరద్ పవార్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో ప్రజలు ఏం కోరుకున్నారో... దానికే తాము కట్టుబడి ఉంటామని ఆయన తెలిపారు. ఎన్సీపీ ప్రతిపక్షంలో ఉండాలని ప్రజలు తీర్పునిచ్చారని... వారి అభీష్టం మేరకు తాము ప్రతిపక్ష స్థానంలోనే కూర్చుంటామని చెప్పారు. ఎన్సీపీ, కాంగ్రెస్ లతో కలసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా? అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు బదులుగా... ఈ దిశగా తమ పార్టీలో ఎలాంటి చర్చ జరగలేదని అన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ బీజేపీ-శివసేనలకు ప్రజలు మెజార్టీ స్థానాలను కట్టబెట్టారని... కానీ ఇప్పుడు ఏం జరుగుతోంది? వారిద్దరూ చిన్నపిల్లల్లా వ్యవహరిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.