అరుదైన రికార్డును అందుకున్న కోహ్లీ.. గంగూలీ రికార్డు బద్దలు
- 50వ టెస్టుకు సారథ్యం వహిస్తున్న కోహ్లీ
- 49 టెస్టులకు కెప్టెన్సీ వహించిన గంగూలీ రికార్డు బద్దలు
- 29 విజయాలతో కెప్టెన్గా సరికొత్త రికార్డు
ఇక, ఈ జాబితాలో మరో మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ధోనీ ఏకంగా 60 టెస్టులకు సారథ్యం వహించాడు. మరో ఏడాదిలోపే కోహ్లీ ఈ రికార్డును కూడా సవరించే అవకాశం ఉంది. మరోవైపు, అత్యంత విజయవంతమైన కెప్టెన్గానూ కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు అతడి సారథ్యంలో 49 టెస్టులు జరగ్గా 29 టెస్టుల్లో జట్టుకు విజయాలు అందించాడు. ధోనీ 60 మ్యాచుల్లో 27 టెస్టుల్లో మాత్రమే భారత్ను గెలిపించాడు. ఇక, 21 విజయాలతో గంగూలీ మూడో స్థానంలో ఉన్నాడు.