రివర్స్ టెండరింగ్ పై ప్రభుత్వం చెబుతున్న లెక్కలన్నీ బోగస్సే: బోండా ఉమ

  • పనుల నాణ్యతను గాలి కొదిలేసి తక్కువ ధరకు టెండర్ ఇచ్చారా?
  • టెండరింగ్ లో కనీసం ముగ్గురు పాల్గొనాలి?
  • పీపీఏలపై పున:సమీక్ష తప్పు అని కేంద్రం చెప్పింది
పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించిన రివర్స్ టెండరింగ్ పై ప్రభుత్వం చెబుతున్న లెక్కలన్నీ బోగస్సే అని టీడీపీ ఏపీ నేత బోండా ఉమ విమర్శించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పనుల నాణ్యతను గాలి కొదిలేసి తక్కువ ధరకు టెండర్ ఇచ్చారా? టెండరింగ్ లో కనీసం ముగ్గురు పాల్గొనాలి, పాల్గొన్నారా? అని ప్రశ్నించారు.

పీపీఏలపై కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ నుంచి ప్రభుత్వానికి ఓ లేఖ వచ్చిందని, పీపీఏలపై పున:సమీక్ష తప్పు అని అందులో పేర్కొన్నారని అన్నారు. రివర్స్ టెండరింగ్ లో లోపాయికారి ఒప్పందాలు బయటపడతాయని చెప్పిన బోండా, ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు స్వస్తిపలికి రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడాలని హితవు పలికారు.
Go Back to Shorts
polavaram
project
Telugudesam
Bonda Uma

More Telugu News