అందుకే మన స్వాతంత్ర్య సమరయోధులు జాతీయ భాషగా హిందీ ఉండాలని కోరుకున్నారు: హోంమంత్రి అమిత్ షా
- దేశంలో ఒకే భాష ఉండాలని వ్యాఖ్య
- అప్పుడే భారత్ ఐక్యంగా ఉంటుందని వెల్లడి
- హిందీ దినోత్సవం సందర్భంగా వివాదానికి ఆజ్యం
- మండిపడుతున్న ప్రతిపక్ష పార్టీలు
ప్రపంచానికి భారత్ తరఫున హిందీ ప్రాతినిధ్యం వహిస్తుందని షా అన్నారు. హిందీ వల్లే దేశం ఐక్యంగా ఉంటుందని షా అభిప్రాయపడ్డారు. కాబట్టి భారతీయులంతా మహాత్మాగాంధీ, సర్దార్ పటేల్ కలలను నిజం చేసేందుకు హిందీ భాష వాడకాన్ని పెంపొందించాలని పిలుపునిచ్చారు. దీంతో షా వ్యాఖ్యలపై పలువురు రాజకీయ నేతలు, నెటిజన్లు, ముఖ్యంగా తమిళనాడు రాజకీయ పార్టీలు అంతెత్తున ఎగిరిపడ్డాయి. హిందీని తమపై బలవంతంగా రుద్దేందుకు మరోసారి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశాయి.