పోలీసులకు భయపడి మేం పోరాటాలు ఆపబోం!: కేశినేని నాని
- ఏపీలో ఛలో ఆత్మకూరు రగడ
- ప్రజా పోరాటాలు కొనసాగిస్తామన్న కేశినేని నాని
- ప్రభుత్వం రాజ్యాంగ విలువలను కాపాడాలని హితవు
ప్రజా ప్రతినిధులను అరెస్ట్ చేయడం సమస్యకు ఎంతమాత్రం పరిష్కారం కాదని స్పష్టం చేశారు. పల్నాడులో పోలీసులు వివక్షాపూరితంగా, ఏకపక్షంగా వ్యవహరించడమే ఈ సమస్యకు మూల కారణమని కేశినేని నాని తెలిపారు. అందులో భాగంగా టీడీపీ శ్రేణులపై తప్పుడు కేసులు నమోదుచేశారని ఆరోపించారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం రాజ్యాంగ విలువలను కాపాడాలనీ, అది ప్రభుత్వ బాధ్యతని కేశినేని నాని చెప్పారు. ఈ మేరకు ట్వీట్ చేసిన కేశినేని నాని.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను ట్యాగ్ చేశారు.